తిరుమల : శ్రీవారిని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.రాష్ట్రంలో 30సంవత్సరాలుగా లేని అభివృద్ధి 3సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు.దేశంలోనే రైతులకు 24 గంటల కరెంటును తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని అన్నారు. కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్దించానని ఆయన తెలిపారు.