హైదరాబాద్ :సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను నగర సీపీ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు స్వాతిలక్రా, అవినాశ్ మహంతి, రఘువీర్లతో పాటు సినీ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. కాగా ఈ చిత్రంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, నిఖిల్ నటించారు. సైబర్ క్రైంల జాబితాకింద బ్యాంకింగ్, ఆన్లైన్, ఏటీఎం తదితర వాటిపై పోలీసులు 5 షార్ట్ ఫిల్మ్లను చిత్రీకరించారు.