వికారాబాద్ : కొడంగల్ పట్టణ కేంద్రంలో రూ. 8 కోట్ల నిధులతో మంత్రులు మహేందర్రెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపనలు చేశారు. రూ. 4.98 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను, రూ. 65 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, సంపు, రూ. 30 లక్షలతో పంచాయతీ భవనం, రూ. 96 లక్షలతో మంచినీటి సరఫరా(12 కి.మీ. మేర పైప్లైన్) పనులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కోడంగల్కు రూ. 50 కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మంత్రిగా జానారెడ్డి ఉన్న సమయంలో కొడంగల్కు కనీసం రూ. 2 కోట్లు కూడా అందించలేదని గుర్తు చేశారు. గ్రామాల నుంచి మండలాలకు, జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర రాజధానికి బీటీ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని మంత్రులు స్పష్టం చేశారు.