ఈ ఏడాది డిసెంబరు చివరికి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయం అందిస్తామని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంటికి అంతర్జాల(ఇంటర్నెట్) సేవలు అందించే దిశగా మరో కీలక అడుగు పడింది. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడి హైటెక్స్లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో అంతర్జాల సేవలకు సంబంధించిన పైబర్ గ్రిడ్ పథకం పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు హాజరవుతున్న రెండున్నర వేల ఐటీ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రాజెక్టు పనితీరును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివరించనున్నారు. ఈ ప్రాజెక్టు పని తీరును, ఐటీ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఇస్తున్న ప్రొత్సాహాకాలను, ఎగుమతుల వివరాలను, ఐటీ, పరిశ్రమల విధానాన్ని మంత్రి ఈ సందర్భంగా వివరించను న్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి తమ ప్రభుత్వం ఎర్రతివాచీని పరుస్తోందని పరిశ్రమల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానాన్ని అవలంబించడంతో పాటు దరఖాస్తు చేసిన మూడు వారాల్లోనే అన్ని అనుమతులను ఇస్తున్న విషయా న్ని సదస్సుకు హాజరవుతున్న ప్రతినిధులకు చెప్పనున్నారు. ఇంటింటికి బ్రాడ్బాండ్ పథకం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పైబర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టింది. పౌర సేవలను నేరుగా ప్రజలకు అందు బాటులోకి తీసుకురావడం, సామాన్యుడికి సైతం సాంకేతిక విప్లవ ఫలితాలను అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సోమవారం సదస్సు ప్రారంభ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంలో బ్రాడ్బాండ్ పథకం ఉద్దేశాలను వివరించారు.