జమ్ము కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉన్న వైమానికదళ స్థావరంలోకి చొరబడటానికి యత్నించిన ఒక వ్యక్తిని భద్రతా దళాలు హతమార్చాయి. వైమానికదళ స్థావరం ఫెన్సింగ్ను దాటి పెరిమీటర్ గోడ వరకూ ఆ వ్యక్తి ప్రవేశించాడని ఎయిర్ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. పదేపదే హెచ్చరించినా ఆ వ్యక్తి పట్టించుకోలేదని, జవాన్లు ముందుగా గాలిలోకి కాల్పులు జరిపి బెదిరించినా ఫలితం లేకపోయిందని ఆ ప్రతినిధి అన్నారు. సెంట్రీ అతడిపైకి కాల్పులు జరిపాడని ఆ అధికారి చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి హుమ్హమా పోలీస్లకు తెలియజేశామని ఆ ప్రతినిధి తెలిపారు.