హైదరాబాద్: ప్రపంచ మాతృదినోత్సవ సందర్బంగా 21న ఉదయం 10 గంటలనుంచి రవీంద్రభారతి కళాభవన్లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి అన్నారు. కళాభవన్లో సోమవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో తెలుగు-ప్రాచీ కావ్య భాషపై సంగనభట్ల నరసయ్య, తెలుగు ఇతర భాషల ప్రభావంపై నలిమెల భాస్కర్, ప్రసార సాధనాల/మాధ్యమాల తెలుగు పై కె.రామచంద్రమూర్తి , పాలన భాషగా తెలుగు పై చంద్రమోహన్ ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ,అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ అతిథులుగా పాల్గొననున్నారని ఆయన చెప్పారు.