సూర్యాపేట: సూర్యాపేట భగత్సింగ్ నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ నేతృత్వంలో పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 35 బైక్లు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.