హైదరాబాద్:హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. సదస్సులో ఇవాళ నూతన సాంకేతికలు, కృత్రిమ మేధస్సు అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. ప్రపంచంలోనే ఓ దేశ పౌరసత్వం పొందిన తొలి రోబో సోఫియా సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సదస్సులో తొలుత రోబో సోఫియా, సృష్టికర్త డేవిడ్ హాన్సన్ ప్రసంగిస్తున్నారు. సదస్సులో విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో దేశ, విదేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులందరికీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది. నగరంలోని చౌమహల్లా ప్యాలెస్లో అతిథులు, ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది.