హైదరాబాద్ : రెండో రోజు ప్రారంభమైన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను, దాని సృష్టికర్త అయిన డేవిడ్ హాన్సన్ ఇంటర్వ్యూ చేశారు. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్ అనే అంశంపై రోబో సోఫియా ప్రసంగం కొనసాగింది. ఈ సందర్భంగా చిట్టిచిట్టి మాటలతో సోఫియా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రోబోకు ప్రత్యేక నిబంధనలు అవసరం లేదని సోఫియా పేర్కొంది. సౌదీ పౌరసత్వాన్ని మహిళా సాధికారత కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. రోబో సోఫియా 66 కంటే ఎక్కువ హావభావాలను వ్యక్తం చేస్తుందని దాని సృష్టికర్త హాన్సన్ తెలిపారు. ఐటీ సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.