నల్లగొండ: రాయితీ గొర్రెల అక్రమ తరలింపును పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్యాల, నార్కెట్పల్లి, వలిగొండ, చౌటుప్పల్కు చెందిన సబ్సిడీ గొర్రెలను నాలుగు లారీల్లో తరలిస్తుండగా మాడ్గులపల్లి వద్ద పట్టుకున్నారు. నిందితులు 585 గొర్రెలను ఆంధ్రాకు తరలిస్తున్నట్లుగా సమాచారం.