బాలసోర్: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-2 మధ్యశ్రేణి క్షిపణిని ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్ఎఫ్సీ) ఈ పరీక్షను నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ మిస్సైల్ను పరీక్షించారు. ఈ క్షిపణి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను చేధించగలదు.