డమస్కస్: సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో 94 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. డమస్కస్కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సిరియా ప్రభుత్వ దళాలు ఈ దాడులు చేసినట్లు తెలుస్తున్నది. సిరియా ఆర్మీ కూడా ఉగ్ర స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లపై దాడులు జరుగుతున్నట్లు డమస్కస్ ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 2013 నుంచి ఈస్ట్రన్ గౌటా మిలిటెంట్ల ఆధీనంలో ఉన్నది. అక్కడ సుమారు 4 లక్షల మంది జీవిస్తున్నారు. డమస్కస్ సమీపంలో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ఏకైక ప్రాంతం అది.