హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధి కార్ఖానలో విషాద సంఘటన నెలకొంది. జీహెచ్ఎంసీ టిప్పర్ అదుపుతప్పి రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు. మృతుడు ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కార్ఖానా పోలీసులు టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.