హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. నిన్న రెండున్నర గంటలపాటు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమై అనేక అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించామని సుబ్రమణ్యన్ తెలిపారు. విలువైన అంశాలు తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రైతులకు నేరుగా నగదు బదిలీ, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు, ఇరిగేషన్, అడవులు, సహకార సమాఖ్య, తదితర అంశాలపై తమ మధ్య సుదీర్ఘంగా, అత్యంత విలువైన చర్చ జరిగిందని సుబ్రమణ్యన్ ట్వీట్ చేశారు. నిన్న సీఎంతో సమావేశమైన అరవింద్ సుబ్రమణ్యన్.. తెలంగాణ పథకాలు బాగున్నాయని ప్రశంసించిన సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయం అందించడం గొప్ప నిర్ణయమని ఆయన కొనియాడారు.