నల్లగొండ : చెన్నై- హైదరాబాద్ వెళ్తున్న ప్రయివేటు బస్సులో నగదు పోయిందని ఓ ప్రయాణికుడు నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 3 లక్షలు అపహరించారని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు బస్సులో తనిఖీలు చేశారు. కానీ బస్సులో నగదు లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.