మహబూబ్నగర్: అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత కిషన్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని పక్కనబెట్టి కులాల వారీగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో టీచర్లు, లెక్చరర్ల నియామకం జరగలేదని పేర్కొన్నారు. 2019లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ఏ వర్గాన్ని తీసుకున్నా తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు.