పానాజి : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను చికిత్స పొందుతున్న లీలావతి ఆసుపత్రినుంచే బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతున్నారని గోవా శాసనసభ స్పీకర్ ప్రమోద్ సావంత్ చెప్పారు. పారికర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని దాదాపు ముగించారని, తొలి పలుకులు మాత్రమే రాయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బడ్జెట్కు తుది రూపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాధికారులతో పారికర్ నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.