బెంగళూరు : నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కొనసాగేందుకు అనర్హుడు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిలా మోదీ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. కర్ణాటకలో, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని.. అవేమీ పట్టనట్లు మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యాతయుతమైన ప్రకటనలు చేయకుండా.. రాజకీయపరమైన వ్యాఖ్యానాలు మోదీ చేయడం సరికాదన్నారు సిద్ధరామయ్య. పాత పెద్ద నోట్లు రద్దు చేసి బ్యాంకుల్లో నగదు జమకు సామాన్యులను క్యూలైన్లలో నిలబెట్టించావు. ఇప్పుడేమో.. నీరవ్ మోదీని రూ. 12 వేల కోట్ల ప్రజాధనంతో వెళ్లనిచ్చావు. ఈ రూ. 12 వేల కోట్లలో ప్రజల డబ్బు ఎంత శాతం ఉంది అని మోదీని ఉద్దేశించి సిద్ధరామయ్య ప్రశ్నించారు.