న్యూఢిల్లీ: చిట్ ఫండ్స్ సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ప్రకటన చేశారు. చిట్ ఫండ్స్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు. జియోపోర్-మల్కన్గిరి మధ్య 130 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. బొగ్గు గనుల వేలం గురించి కొత్త పద్ధతికి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మహానది జల వివాదం పరిష్కారం కోసం కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసేందుకు కూడా క్యాబినెట్ అంగీకరించింది. రైల్వే రంగంలో మొరక్కొ, భారత్ మద్య సుదీర్ఘకాల సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కూడా మంత్రి తెలిపారు.