న్యూఢిల్లీ: ఢిల్లీ సెక్రటేరియేట్లో గందరగోళం నెలకొన్నది. రాజకీయవేత్తలకు, అధికారులకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్పై ఇద్దరు ఎమ్మెల్యేలు.. సీఎం కేజ్రీ ఇంట్లోనే దాడి చేశారన్న నేపథ్యంలో ఢిల్లీ సచివాలయం ఇవాళ టెన్షన్ టెన్షన్గా మారింది. కేజ్రీ ప్రభుత్వం వైఖరి తీరు పట్ల ఆ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇవాళ ఆందోళనకు దిగడంతో సెక్రటేరియేట్కు పోలీసులు వచ్చారు.
అక్కడ ఆఫీసర్లు నినాదాలతో హోరెత్తించారు. ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం.. ఢిల్లీ సీఎం కేజ్రీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. కొన్ని ఏండ్ల నుంచి కేజ్రీ కార్యాలయంలో ఇలాంటి తంతు జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేల సమక్షంలో.. చీఫ్ సెక్రటరీపై దాడి జరిగినట్లు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ఆరోపించింది. ప్రధాన కార్యదర్శిపై దాడి జరిగిన సంఘటనను లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు ఐఏఎస్ సంఘ కార్యదర్శి మనిషా సక్సేనా తెలిపారు.