కరీంనగర్: ప్రభుత్వాధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో మంత్రి ఈటల పర్యటించారు. పర్యటనలో భాగంగా చెల్లింపులు, అకౌంట్స్ కార్యాలయాన్ని ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతీ రూపాయి ప్రజలదే..వాటిని జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. గోదావరి జలాలతో సస్యశ్యామలమయ్యేది కరీంనగర్ జిల్లానేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.