కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పర్యటించారు. ఎల్ఎండీ కాలనీలో ఏర్పాటు చేసిన చెల్లింపులు, అకౌంట్స్ కార్యాలయాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రభుత్వాధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజలదే.. వాటిని జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పారు. గోదావరి జలాలతో ప్రథమంగా సస్యశ్యామలం అయ్యేది కరీంనగర్ జిల్లానే అని ఆయన తెలిపారు.