ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకౌంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 03:35 PM

కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పర్యటించారు. ఎల్‌ఎండీ కాలనీలో ఏర్పాటు చేసిన చెల్లింపులు, అకౌంట్స్ కార్యాలయాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రభుత్వాధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజలదే.. వాటిని జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పారు. గోదావరి జలాలతో ప్రథమంగా సస్యశ్యామలం అయ్యేది కరీంనగర్ జిల్లానే అని ఆయన తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com