న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ఆర్బీఐ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. ఒక బ్యాంకులో ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంటే ఎందుకు గమనించలేదని కేంద్రం ఆర్బీఐకి లేఖ రాసింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వేల కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టి పరారైన కేసులో సమాధానం చెప్పాలంటూ కేంద్రం ఆర్బీఐకి లేఖ రాసింది.