హైదరాబాద్: ఈ నెల 23 నుంచి 25 వరకు సంగీత, నాటక అకాడమీ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల సారథ్యంలో కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో చిందుయక్షగానోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జానపదకళలకు ప్రాధాన్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు.