తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర పైనాన్స్ కమీషన్ చైర్మెన్ జి.రాజేశం గౌడ్ నేడు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దన్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. జేఈవో శ్రీనివాసరాజు.. రాజేశం గౌడ్ దంపతులకి స్వామి వారి తీర్ధప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాజేశం గౌడ్ పేర్కోన్నారు.