నల్లగొండ: నాగార్జున సాగర్ ఎడమకాల్వలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా వద్ద చోటుచేసుకుంది. అన్నాదమ్ముల మధ్య చెలరేగిన వివాదంలో మనస్థాపానికి గురైన అన్న కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గల్లంతైన వ్యక్తి రమేష్(47) ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రమేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.