జైపూర్ : ముంబయిలోని మాటుంగా మహిళా రైల్వేస్టేషన్ మాదిరిగానే రాజస్తాన్లోని మరో రైల్వే స్టేషన్ను కూడా పూర్తిగా మహిళలకే అప్పగించినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. జైపూర్లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్లో పోర్టర్ మొదలుకొని స్టేషన్ మాస్టర్ వరకు మహిళలే పనిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ స్టేషన్లో మొత్తం 40 మంది మహిళలు పనిచేస్తారు. దేశంలోనే పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న రెండో స్టేషన్ కాగా, ఉత్తరాదిలో ఇదే మొదటిది. అలాగే భద్రత కోసం ఈ స్టేషన్ అంతటా సిపి టీవీ కెమెరాల్ని ఏర్పాటుచేశారు.