మేడ్చల్ : మేడ్చల్లో బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. పట్టణంలోని బస్ డిపో ముందు ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెనుకాల కూర్చున్న మహిళ కింద పడిపోయింది. వేగంగా దూసుకువచ్చిన లారీ.. ఆ మహిళపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మహిళ ముఖం చిధ్రమైంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.