సెంచూరియన్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ ముగిసిన తరువాత తన కుటుంబాన్ని గుర్తుకుతెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యాడు. చాలారోజుల పాటు మనం అమితంగా ప్రేమించే వారికి దూరంగా ఉండటం కష్టమేనని వివరించాడు. ఆతిథ్య సఫారీలతో సుధీర్ఘ పర్యటన కోసం గతేడాది డిసెంబర్ చివరి వారంలో సౌతాఫ్రికాకు చేరుకుంది టీమిండియా. ఐతే టెస్టు సిరీస్ సమయంలో భారత క్రికెటర్ గబ్బర్ భార్య, పిల్లలు కొద్దిరోజులు అక్కడే ఉండి తరువాత భారత్ తిరిగొచ్చేశారు. ఈ మధ్యలో చాలా రోజులు గడిచిపోవడంతో నా కుటుంబసభ్యులను ఎంతో మిస్అవుతున్నానని ధావన్ తెలిపాడు.
మన కుటుంబానికి ఎప్పుడైతే చాలా రోజుల పాటు దూరంగా ఉంటామో అప్పుడే తెలుస్తుంది.. వాళ్లను మనమెంత కోల్పోతున్నామో. నా పిల్లలతో ఆడుకోవడానికి కేటాయించే సమయం, వారి కోసం వంటచేయడం, వాళ్లతో గడపడం మిస్సవుతున్నాను. అంతేకాదు, నా ప్రియమైన భార్యకు కూడా. స్వదేశానికి తిరిగి వెళ్లిన తరువాత నా పూర్తి సమయాన్నిఆమె కోసమే కేటాయిస్తాను. లవ్ యూ ఆల్ ! అని ధావన్ ట్వీట్ చేస్తూ.. తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా ధావన్కు తన కుమారుడు జోరావర్ ధావన్ అంటే ఎంతో ఇష్టం. అతడితో ఫన్నీగా ఉంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటాడు.
Only when u spend so much time away from fmly, u realize hw much u actually miss them!I miss spending time with my kids, playing with them, cooking and being there for them. Also miss the Mrs like crazy!Want 2 spend quality time with her once I go back.luv u all to d moon & back! pic.twitter.com/BTo6K0ead8
— Shikhar Dhawan (@SDhawan25) February 20, 2018