హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల డిజిటలైజేషన్ ప్రారంభించామని మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో మూడో రోజు జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ఫిన్ల్యాండ్లో విద్యుత్తో పంటలు పండిస్తున్నారని, భవిష్యత్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు.