హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాజరయ్యారు. మూడు రోజుల పాటు హెచ్ఐసీసీ వేదికగా ఈ సదస్సు జరిగింది. వివిధ దేశాల నుంచి ఐటీ కాంగ్రెస్కు హాజరైన అందరికీ మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సమావేశం ఆర్మేనియాలో జరగనుంది. దీంతో ఆర్మేనియాకు సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రపంచ ఐటీ కాంగ్రెస్ అప్పగించింది. అనంతరం హైదరాబాద్ - తైవాన్ సిటీ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.