ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌ఐసీసీలో ఐటీ కాంగ్రెస్ ముగింపు వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 04:45 PM

హైదరాబాద్: నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాజరయ్యారు. మూడు రోజుల పాటు హెచ్ఐసీసీ వేదికగా ఈ సదస్సు జరిగింది. వివిధ దేశాల నుంచి ఐటీ కాంగ్రెస్‌కు హాజరైన అందరికీ మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సమావేశం ఆర్మేనియాలో జరగనుంది. దీంతో ఆర్మేనియాకు సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రపంచ ఐటీ కాంగ్రెస్ అప్పగించింది. అనంతరం హైదరాబాద్ - తైవాన్ సిటీ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com