ముంబయి: రైల్వే భద్రతా సిబ్బంది ప్రాణాపాయం నుంచి ఓ మహిళా ప్రయాణికురాలిని కాపాడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం నెంబర్ 4పై మహిళ కదిలే రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. కాగా ఈ ప్రయత్నంలో మహిళా అదుపుతప్పి దాదాపుగా రైలు కిందపడిపోయే స్థితికి చేరింది. గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి తోటి వ్యక్తులతో కలిసి మహిళను రైలు కింద పడకుండా కాపాడారు. మహిళ ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.