ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాండేపై ధోనీ ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 09:22 AM

ఎప్పుడూ కూల్‌గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీకి కోపమొచ్చింది. ‘ఓయ్ ఇటు చూడు.. అటెటో చూస్తున్నావేంటి’ అంటూ మనీష్ పాండేపై గట్టిగా అరిచేశాడు. అదే ఊపులో సిక్స్ బాదేశాడు. ఈ అరుదైన ఘటన బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకుంది. సెంచూరియన్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో మనీష్ పాండే (79 నాటౌట్), ఎం.ఎస్.ధోనీ (52 నాటౌట్) చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించడంతో వీరిద్దరి కష్టం వృథాగా పోయింది.


ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వద్ద పాండేపై ధోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు ధోనీ స్ట్రైకింగ్‌లో ఉండగా.. పాండే నాన్-స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలుచున్నాడు. అప్పటికే వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఓవైపు ఫోర్లు, సిక్సులు బాదుతూనే ధోనీ స్టైల్ రెండు పరుగులు కూడా తీస్తున్నారు. అయితే 19వ ఓవర్ జరుగుతున్నప్పుడు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పాండే ఎటో చూస్తున్నాడు. అంతే ధోనీకి చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్ కిదర్ దేక్ రా హై. ఉదర్ కా దేక్ రా హై. అవాజ్ నహీ జాయేగి, ఇషారా దేకియో’ అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com