యాదాద్రిభువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు 9.30 గంటలకు ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ప్రారంభంకానున్నాయి. అనంతరం ఉదయం 11 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ జరుగనుంది. రాత్రి 9గంటలకు స్వామివారికి సింహవాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివస్తున్నారు.