ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో జీహెచ్‌ఎంసీ మున్సిపల్ బాండ్ల నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 10:56 AM

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో జీహెచ్‌ఎంసీ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రారంభించారు. బాండ్ల జారీ ద్వారా బల్దియా రూ. 200 కోట్ల నిధులు సమకూర్చుకోనుంది. మరో రూ. 800 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం సేకరించనుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. దేశంలో నాలుగు వేల మున్సిపాలిటీల్లో ఆర్థిక స్థిరత్వం ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ అన్నారు. దేశంలో పూణే తర్వాత బాండ్ల ఇష్యూ ద్వారా నిధులు సేకరించిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది. ఆర్థిక స్వయం సమృద్ధిలో కేర్ ఇండియా రేటింగ్ సంస్థ ఏఏ రేటింగ్ ఇవ్వడంతో బాండ్ల ఇష్యూ సులభతరం అయిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఖమ్మం మేయర్ పాపాలాల్, కరీంనగర్ మేయర్ రవిందర్‌సింగ్, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com