ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్ద‌రు ఆప్ ఎమ్మెల్యేల‌కు జుడిషియ‌ల్ క‌స్టడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 10:58 AM

ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు గురువారం వరకూ జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు అమాన్‌తుల్లా ఖాన్‌, ప్రకాష్‌ జార్వల్‌ బెయిల్‌ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించనుంది. ప్రకాష్‌ జార్వల్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేయగా, అమాన్‌తుల్లాను బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. బుధవారం విచారణలో ముందుగా కోర్టు ఎమ్మెల్యేల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఎమెల్యేలు విచారణకు సిద్దంగా వున్నారని మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ షెఫలీ బర్నాలా తెలిపారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వద్దకు ఆప్‌ కార్యకర్తలు, న్యాయవాదులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.


ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమక్షంలోనే ఆప్‌ ఎమ్మెల్యేలు తనపై దాడికి పాల్పడ్డారని అన్షు ప్రకాశ్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయన ఆరోపణలను ఆప్‌ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. బీజేపీ ఆదేశాల మేరకు అన్షు ప్రకాష్‌ పని చేస్తున్నారని, ఈ కారణంతో ఆప్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని అమాన్‌తుల్లా ఖాన్‌ తెలిపారు. ముందస్తు ప్రణాళికతో ఆప్‌ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఢిల్లీలో చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొద‌టి నుంచి ఏవో స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. భాజపా ప్ర‌భుత్వం, ఆమ్ఆద్మీ మ‌ధ్య స‌యోధ్య‌తో కూడిన వాతావ‌ర‌ణం మొద‌టి నుంచి లేదు. అప్ప‌ట్లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ మ‌ధ్య వివాదం కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇవ‌న్నీ యాదృచ్చికంగా జ‌రుగుతున్నాయా, కావాల‌నే ఎవ‌రో వెనుక ఉండి ఆప్ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్నారా అనే విష‌యం తెలియాల్సి ఉంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com