పెద్దపల్లి : కాకతీయ రాజుల భౌగోళిక, వాస్తవాలు, వారి శాస్త్రీయ పద్ధతులను విశ్లేషిస్తూ నిర్మించిన(డాక్యుమెంటరీ) చిసేల్డ్కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లికి చెందిన అల్లాడి రామ్ 16 ఏండ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. కాకతీయ కాలంలో ఆనాటి భౌగోళిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని కట్టిన నిర్మాణాలను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో 2016లో స్వదేశానికి వచ్చిన ఆయన, చిసేల్డ్ పేరిట కాకతీయ వైభవాన్ని తెలిపేలా లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పురస్కారాలు గెలుచుకుంది. నేడు అమెరికాలో ఓజీఛీ ఇంటర్నేషనల్ హిస్టరీ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తుండగా, అందులో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది.