'ట్రంప్' టవర్ న్యూయార్క్లో కదా ఉంది... ముంబయిలో ఏంటి అనుకుంటున్నారా... అవునండీ.. ఇది నిజం. ముంబయిలో కూడా ట్రంప్ టవర్ నిర్మాణం జరుపుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయుడు డోనాల్డ్ జాన్ ట్రంప్కు చెందిన కంపెనీ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ టవర్లో మొత్తం 78 అంతస్తులు ఉంటాయి. ఇందులో... 400 విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కోదాని ధర రూ.16 కోట్ల పైగా ఉంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ భవనం 2019 జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.ఈ భవనం స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ ఫిబ్రవరి 22న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును డోనాల్డ్ జాన్ ట్రంప్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది.