హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఈ రోజు విచారణ కోసం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావలసిన అవసరం లేదు. మార్చి మొదటి వారంలో విచారిస్తామని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి రామ్ గోపాల్ వర్మకు సమాచారం అందింది. ఆయన వద్ద నుంచి సీజ్ చేసిన లాప్ టాప్ కు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందకపోవడంతో విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది.