తిరువనంతపురం : కేరళ రైతు రోడ్డెక్కాడు. దీంతో కేరళ-తమిళనాడు మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. తమిళనాడు సరిహద్దు గ్రామాలలో రైతులు సమ్మెకు దిగి రోడ్డుపై బైఠాయించడంతో కేరళ-తమిళనాడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కూరగాయలను రవాణ ాచేస్తున్నదాదాపు 200 లారీలు నిలిచిపోయాయి. దీంతో కూరగాయల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. కేరళ-తమిళనాడుల మధ్య ఒప్పందం మేరకు అలియార్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ కేరళ రైతులు తమిళనాడు సరిహద్దు లో బైఠాయించారు. అలాగే పొల్లాఛి, గోపాలపురం, మీనాక్షి పురం, వెలంతవాలెం, నోడుపుని, గోవిందాపురం గ్రామాలలో పెద్ద సంఖ్యలోవాహనాలను అడ్డుకున్నారు.