ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో రైతుల సమ్మె

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 12:17 PM

తిరువనంతపురం : కేరళ రైతు రోడ్డెక్కాడు. దీంతో కేరళ-తమిళనాడు మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. తమిళనాడు సరిహద్దు గ్రామాలలో రైతులు సమ్మెకు దిగి రోడ్డుపై బైఠాయించడంతో కేరళ-తమిళనాడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కూరగాయలను రవాణ ాచేస్తున్నదాదాపు 200 లారీలు నిలిచిపోయాయి. దీంతో కూరగాయల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. కేరళ-తమిళనాడుల మధ్య ఒప్పందం మేరకు అలియార్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ కేరళ రైతులు తమిళనాడు సరిహద్దు లో బైఠాయించారు. అలాగే పొల్లాఛి, గోపాలపురం, మీనాక్షి పురం, వెలంతవాలెం, నోడుపుని, గోవిందాపురం గ్రామాలలో పెద్ద సంఖ్యలోవాహనాలను అడ్డుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com