ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం ఇంటికి పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 12:25 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌ను సమీక్షించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్‌షు ప్రకాశ్‌పై .. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా దుమారం లేపింది. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే సీఎస్‌పై ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, వారిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు, ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీ ఇంట్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు ఇవాళ ఢిల్లీ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. దాడి ఘటన పట్ల సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పేంంత వరకు ఆ రాష్ట్ర మంత్రులు చేపట్టే కార్యక్రమాలకు హాజరుకాబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com