హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపట్ల హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసిందని, దాదాపు 100 కేసులు వేసిందని అన్నారు. ఈ కేసులు వేయించిన నాయకుడి పేరు త్వరలో బైటపెడతానని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రైతాంగం, ధర్మం, న్యాయం గెలిచాయని ఆయన అన్నారు.