రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్రికెట్ ఆడారు. అయితే అది మైదానంలో కాదు. వర్చువల్ రియాల్టీలో ఆయన క్రికెట్ ఆడారు. ఈస్పోర్ట్స్ ప్రోడక్ట్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్నాథ్.. వర్చువల్ రియాల్టీ క్రికెట్ ఆడారు. కండ్లకు వీఆర్ అద్దాలు పెట్టుకుని, చేతిలో బ్యాట్తో ఆయన కొన్ని షాట్స్ కొట్టారు. ఈ ఈవెంట్కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ప్రెసిడెంట్ క్రికెట్ ఆడిన ఫోటోను మాత్రం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.