తెలంగాణ రైతులకు త్వరలో మంజూరు చేయనున్న కొత్త పాసుపుస్తకాల పంపిణీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ మాట్లాడుతూ పాసుపుస్తకాల తయారీ పక్కాగా జరిగాకే పంపిణీ చేపట్టాలన్నారు. పాసుపుస్తకాలకు ఆధార్కార్డు నెంబర్ కచ్చితంగా అనుసంధానించాలన్నారు. ఆధార్ నెంబర్లేని భూములను బినామీలుగా గుర్తించాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.