హైదరాబాద్: కొండాపూర్లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి నలుగురు కూలీలు మృతి చెందారు. సెల్లార్ కూలడంతో మట్టిలో కూరుకుపోయి నలుగురు సజీవ సమాధి అయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా కూలీలు ఉన్నారు. రంగంలోకి దిగిన స్థానికులు, సహాయక సిబ్బంది వారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొండాపూర్లోని గూగుల్ ఆఫీస్ పక్కనే ఉన్న స్థలంలో సెల్లార్ తవ్వుతుండగా భారీ నిర్మాణం చేపడుతుండగా మట్టిపెల్లలు విరిగి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.