యూపీకి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెను దుమారం రేగుతోంది. ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, వివాదాల్లో చిక్కుకున్న బీజేపీ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించింది ముస్లింలే.. కాబట్టి వారంతా దేశం వదిలి వెళ్లిపోవాలని మొన్నటికి మొన్న బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ సంచన వ్యాఖ్యలు చేశారు. అలాగే బిహార్కు చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయోధ్య వివాదంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. భారతీయులంతా రాముడి వారసులేనని పేర్కోవడం గమనార్హం.
తాజాగా ఉత్తరప్రదేశ్కు బీజేపీ ఎమ్మెల్యే బైరియా సురేంద్ర నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పమవుతున్నాయి. బాలియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై, వందేమాతరం’ అనని వాళ్లంతా పాకిస్థానీలేనని వ్యాఖ్యానించారు. ‘తాము నివశించే మాతృభూమికి తల్లి హోదా ఇవ్వని వ్యక్తుల దేశభక్తిపై సందేహమేనని, భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినదించడానికి ఇబ్బంది పడేవాళ్లను రాజకీయాల్లోకి అనుమతించకూడదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన గత నెలలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘2024లోపు భారత్ సంపూర్ణ హిందూ దేశంగా మారనుంది. ఒకసారి హిందూ రాష్ట్రంగా మారిన తర్వాత హిందూ సంప్రదాయాలను ఆపాదించుకున్న ముస్లింలు మాత్రమే ఇక్కడ ఉంటారని’వ్యాఖ్యానించి పెనుదుమారాన్నే రేపారు.
అక్రమ ఇసుక రవాణా మాట్లాడుతూ.. వ్యక్తిగత అవసరాలకు ఇసుకను తరలించేవారిని పోలీసులు అడ్డుకుంటే వారి చెంపలు వాయించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ పోలీసులు ఒక దొంగను పట్టుకుని, అవమానించితే, ప్రజలు కూడా పోలీసులకు అదే విధంగా చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధి ఇలా బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa