ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్మన్‌ప్రీత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 09:23 AM

భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్.. భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. దీంతో.. అప్పట్లో పంజాబ్ ప్రభుత్వం ఆమెకి పోలీస్ డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేసింది. కానీ.. అప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తున్న హర్మన్‌ప్రీత్ ఐదేళ్ల కాలానికి బాండ్‌పై సంతం చేసి ఉండటంతో.. ఆమెని రిలీవ్‌ చేసేందుకు నిబంధనలు అడ్డొచ్చాయి.


రైల్వే బాండ్ సమస్యని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ దృష్టికి హర్మన్‌ప్రీత్ కౌర్ తీసుకెళ్లగా.. ఆయన రైల్వే మంత్రికి లేఖ రాసి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సీఎం లేఖకి స్పందించి రైల్వే శాఖ ఈ క్రికెటర్‌ని ఇటీవల విడుదల చేయడంతో.. తాజాగా ఆమె పోలీస్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, డీజీపీ సురేశ్ అరోరా .. హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో.. ఆమె దుస్తులకి ఉన్న నక్షత్రాలను స్వయంగా అమర్చడం విశేషం. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుపై 3-1తేడాతో టీ20 సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa