న్యూఢిల్లి : పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎపి విభజన చట్టంపై చర్చించాలంటూ టిడిపి ఎంపిలు ఆందోళన చేపట్టారు. లోక్సభలో విపక్షాల ఆందోళనతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని ఎపి ఎంపిలు ఆందోళన చేపట్టారు. విపక్షాలు కూడా వారికి మద్దతు ప్రకటించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను ఉదయం పదకొండున్నర వరకూ వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa