వరంగల్: మూడో ఫ్రంట్కు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్కే ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈరోజు వరంగల్లో కడియం మాట్లాడాతూ కాంగ్రెస్, బీజేపీల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడో కూటమి లేదా ప్రత్యామ్నాయం కచ్చితంగా అవసరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్, బీజేపీ కృషి చేయలేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి పెట్టుబడి రాయితీ ఇస్తుంటే దేశంలో ఎందుకివ్వరని ప్రశ్నించారు. తెలుగు ప్రజలు తలుచుకుంటే బీజేపీ, కాంగ్రెస్ను లేకుండా చేయొచ్చని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని, అవసరమైతే మూడో కూటమి ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చునని అన్నారు. దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. మూడో కూటమితో వామపక్షాలు, చంద్రబాబు కలిసి రావాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గాని, కాంగ్రెస్ గానీ వచ్చే అవకాశాలు లేవన్నారు. కేంద్రం.. తెలంగాణపై ఓ విధంగా, ఏపీపై మరో విధంగా వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. నాడు ఢిల్లిdలో ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. నేడు మళ్లిd కేసీఆర్ ఆ పని చేస్తున్నారని పేర్కొన్నారు. మూడో ఫ్రంట్కు తెలుగు ప్రజలతో పాటు చంద్రబాబు మద్దతివ్వాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa